Posted On: Thursday,July 18,2019 ప్రజాశక్తి- అమరావతి తెలుగుతల్లి కెనడా మ్యాగజైన్ వారు 'కెనడా డే -2019' కథలు, కవితలు, చిత్రలేఖనం, కార్టూన్ల విభాగాల్లో నిర్వహించిన పోటీ ఫలితాలను ప్రకటించారు. కథల విభాగంలో ప్రజాశక్తి ఎడిటోరియల్ విభాగంలో పనిచేస్తోన్న రాజాబాబు కంచర్ల (కె.ఎక్స్.రాజు) రాసిన 'మూగవైతేనేమిలే...' కథకు బహుమతి లభించింది. తెలుగుతల్లి కెనడావారు నిర్వహించే పోటీలో బహుమతి అందుకోవడం ఇది వరుసగా మూడోసారి. 2017లో 'చీకటిదారుల్లో వెలుగురేఖలు', 2018లో 'మాతద్రోహం' కథలకు బహుమతి లభించింది. బహుమతి పొందిన కథలు, కవితలు, కార్టూన్లను ఆగస్టు నుంచి వచ్చే యేడాది జూలై వరకు వరుసగా తెలుగుతల్లి మ్యాగజైన్లో ప్రచురిస్తారు. వాస్తవ పరిస్థితులు కళ్లకు కట్టేలా ఈ సినిమా ఉంటుందన్నారు. సినిమా విడుదలైన మొదట్లో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ప్రస్తుతం సినిమాకు ఆదరణ పెరిగిందన్నారు.